Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లో బాలుడి హృదయ విదారక ఘటనపై స్పందించిన కోర్టు
- సుమోటోగా స్వీకరణ
పాట్నా : 'ఆ ఘటన కలచివేసింది.. నిజంగా దురదృష్టకరం' పాట్నా హైకోర్టు వ్యాఖ్యలివి. రెండు రోజుల క్రితం బీహార్లోని ముజఫర్నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై తల్లి మతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఓ రెండేండ్ల చిన్నారి హదయ విదారక ఘటనపై పాట్నా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గుజరాత్ నుంచి శ్రామిక్ రైలులో బయలుదేరిన బాధితురాలు అర్బీనా ఆకలి, వడగాడ్పులు, డీహైడ్రేషన్తో కదులుతున్న రైలులోనే మృతిచెందిన విషయం తెలిసిందే. పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కరోల్, జస్టిస్ ఎస్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా బీహార్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారా లేదా, ఆమె మృతికి కారణాన్ని ధ్రువీకరించారా అని కోర్టు ప్రశ్నించింది. తల్లి చనిపోవడంతో అనాథగా మారిన ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు?' అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం తరపున రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఎస్డీ యాదవ్ స్పందించారు. అర్బినా ఇన్ఫాత్ది సహజ మరణమే. సూరత్ నుంచి రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సమయానికి తిండి లేక ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతోనే మతి చెందింది. ఈ విషయాన్ని మతురాలి చెల్లి, ఆమె భర్త స్వయంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదనీ తెలిపారు. ఈ కేసును మేము ప్రత్యేకంగా తీసుకున్నామనీ, అర్బినా కుటుంబాన్ని కలవడానికి కొంతమంది అధికారులను పంపించామని చెప్పారు. వారికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర నివేదికను తదుపరి విచారణ తేదీ జూన్ 3 నాటికి సమర్పించాలని రాష్ట్ర అధికారులను కోర్టు ఆదేశించింది.