Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మరో 58 చైనా యాప్లు కూడా..
న్యూఢిల్లీ : టిక్టాక్, యూసీ బ్రౌజర్తో సహా 59 చైనా యాప్లపై భారత్ సోమవారం నిషేధం విధించింది. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో మోడీ సర్కార్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దేశ సౌర్వభౌమా ధికారం, సమగ్రత, రక్షణ, భద్రత, ప్రజాభద్రతకు భంగం కలిగించే కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సరిహద్దు వివాదానికి సంబంధించి జూన్ 15న లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణల్లో భారత్కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చైనా వైపు కూడా మరణాలు సంభవించినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. చైనా యాప్లు నిషేధించాలని డిమాండ్లతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషేధం విధించిన యాప్ల జాబితాలో షేర్ఇట్, హలో, లైఖి, కామ్ స్కానర్, యు వీడియో, వి చాట్, క్లబ్ ఫ్యాక్టరీ తదితర యాప్లు ఉన్నాయి.