Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజోలు : తూర్పుగోదావరి జిల్లా రాజోలు పంచాయతీ రోడ్డులోని గోదావరి గ్రామీణ బ్యాంకు సమీపంలో ఈదురు గాలులు, వర్షానికి పాత డాబా స్లాబ్ కూలిపోవడంతో వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రాజోలుకు చెందిన వర్రే నాగరత్నానికి (75) ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు ఉద్యోగరీత్యా హైదరాబాద్, చెన్నైలో ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఆమె పాత డాబాలో ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల మూడున ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో, స్లాబ్ కూలిపోయింది. అయితే, ఈ విషయాన్ని స్థానికులు ఎవరూ గుర్తించలేదు. రెండు రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చిన స్థానికులు పరిశీలించగా, శిథిలాల కింద ఆమె మృతి చెంది ఉంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.