Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏలూరు : రైల్వేను ప్రయివేటీకరించే ప్రయత్నాలను బిజెపి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి పి.కిషోర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇప్పటికే టెలికాం, బొగ్గు రంగాలను ప్రయివేటీకరించిందని తెలిపారు. ఇన్సూరెన్స్, విద్యుత్, రక్షణ రంగాలను ప్రయివేటీకరిస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. తాజాగా రైల్వేను ప్రయివేటు సంస్థలకు ఇస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గమన్నారు. రైల్వేను ప్రయివేట్ కంపెనీలకు కట్టబెడితే రైలు ప్రయాణాల్లో ప్రజల ప్రాణాలకు భద్రత ఉండదన్నారు. రైల్వే ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేస్తారని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయివేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.