Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు
శ్రీకాకుళం : ఉపాధి హామీ పథకం పనులను నిలుపుదల చేయొద్దని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెంలో ఉపాది హామీ కూలీలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నివారణలో భాగంగా రెండు నెలల పాటు విధించిన లాక్డౌన్తో కూలీలు పనులు కోల్పోయా రని తెలిపారు. ఆలస్యంగా ఉపాధి పనులు ప్రారంభమైనా కూలీలకు కొంత ఉపశమనం కలిగింద న్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో అధికారులు కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులను నిలిపివేశా రని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సడలిం పుతో వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నా రని, పనిలేక పిల్లాపాపలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాని కుటుంబానికి రూ.7500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 10 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించి రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, సిఐటియు నాయకులు మల్లేశ్వరరావు, ఉష, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.