Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లోకో పైలట్, ఎఎల్పి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి : రైల్వేలో సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డిఎఫ్సిసిఐఎల్) అనే కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా దానిని మరింత విస్తృత పర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కార్పొరేషన్లో అత్యధికమంది అధికారులు, ఉద్యోగులు భారతీయ రైల్వేల నుంచి డెప్యుటేషన్పై వచ్చినవారే కాగా ఇప్పుడు కొన్ని పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకోనుంది.
సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్లను, వాటి నిర్వహణ, యాజమాన్యానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలని 2006లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది మొదట్లో నత్త నడకగానే సాగింది. 2015 తరువాత ఆ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో డిఎఫ్సిసిఐఎల్ పరిధిలో దాదాపు పది వేల కిలో మీటర్ల రైల్వే లైన్లు ఏర్పాటయ్యాయి. దేశంలో సుమారు 96 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ వుంది. అంటే డిఎఫ్సిసిఐఎల్ వాటా పది శాతం అన్నమాట. ఇప్పటి వరకు సరుకు రవాణా విభాగం ఇండియన్ రైల్వే కింద ఉండగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుందని పలువురు అభిప్రాయపడుతన్నారు. అత్యధిక ఆదాయం వచ్చే రూట్లను తొలుత ఈ కార్పొరేషన్కు అప్పగించి, ఆ తరువాత గుండుగుత్తగా దాన్ని ప్రైవేటీకరిస్తారని అంటున్నారు. తొలి దశలో ఈ విభాగానికి అనుగుణంగా దశల వారీగా సిబ్బంది అవసరాన్ని తీర్చాలని డిఎఫ్సిసిఎల్కు రైల్వే బోర్డు సూచించిందని సమాచారం. ట్రాఫిక్ అంచనాలు, సమయాన్ని దష్టిలో ఉంచుకోవాలమది. పోస్టుల ఏర్పాటు కోసం పాలసీని అండర్-1గా బోర్డు ఆఫ్ డైరెక్టరేట్ (అన్ని విభాగాల ఉన్నతాధికారులు) ఆమోదించింది. ఇందుకోసం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
కేటగిరి పోస్టుల సంఖ్య అసిస్టెంట్ లోకో పైలట్ (ఎన్-5, ఎన్-7)1306లోకో పైలట్ (ఈఓ-ఈ1)1306లోకో ఇన్స్పెక్టర్ (ఈ2-ఈ3) 86క్రూ కంట్రోలర్ (ఈ1) 70 మొత్తం: 2768ఇండియన్ రైల్వే నుంచి తక్షణ అవసరాల కోసం డిప్యుటేషన్ ద్వారా 245 మంది చొప్పున అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్లను తీసుకునేందుకు కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎఎల్పి పోస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని భావిస్తుండగా ఉన్నత స్థాయి పోస్టులను ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి డిప్యుటేషన్పై భర్తీ చేసేందుకు కార్పొరేషన్ లేఖ రాసినట్లు తెలిసింది. ఇండియన్ రైల్వే ద్వారా కాకుండా కార్పొరేషన్ ద్వారా భర్తీ అయ్యే సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో తేడా ఉంటుందని రైల్వే ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రయాణీకుల రైళ్లు ప్రైవేటుకు అప్పగిస్తున్న ప్రభుత్వం సరుకు రవాణాలో ఆ ప్రక్రియను వేగవంతం చేస్తోందని అంటున్నారు.