Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-43 మంది మృతి
లక్నో : యూపీ, బీహర్లో మళ్లీ పిడుగుల బీభత్సం సృష్టించాయి. 43 మంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్లో శనివారం ఒక్కరోజే 23 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. అలహాబాద్లో ఎనిమిది మంది, మిర్జాపూర్లో ఆరుగురు, కౌశంబీలో ఇద్దరు, జాన్పూర్లో ఒక్కరు చొప్పున మతి చెందినట్టు అధికారులు తెలిపారు. బధోరు జిల్లాలో ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సిఎం యోగి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బీహార్లో 20 మంది మరణించగా, తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. భోజ్పూర్ జిల్లాలో 9 మంది, సారణ్లో ఐదుగురు,కైమూర్లో ముగ్గురు, పాట్నాలో ఇద్దరు, బక్సర్లో ఒకరు మరణించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. నాలుగు లక్షలు పరిహారం ప్రకటించింది.