Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోమాలియా దేశం నుండి మిడతల దండు భారత-పాక్ సరిహద్దుల్లోని సంతానోత్పత్తి ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశమున్నందున ఆరు రాష్ట్రాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అప్రమత్తం చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, హర్యానా రాష్రా ్టల్లో పంటలు నష్టపోకుండా మిడతలను నివారించేందుకు మిడత సర్కిల్ కార్యాలయాల ద్వారా చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా నుంచి వచ్చే మిడతల దండు మన దేశంలోని 6 రాష్ట్రాల్లో తీవ్ర మైన పంటనష్టం కలిగి స్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయశాఖ పేర్కొంది. జైసల్మేర్, బార్మెర్, జోద్ పూర్, నాగౌర్, సికార్, జైపూర్, రాజస్ధాన్ లోని అల్వార్, మధ్యప్రదేశ్ లోని టికామ్గ ప్రాంతాల్లో మిడతలు ప్రవేశించాయి. దీంతో ఆరు రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఎడారి మిడతలు రోజుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని, చదరపు కిలోమీటర్ల మిడతల దండు ఒకరోజులో 35వేల పంటలను తింటాయని అంచనా వేశారు. దీంతో మిడతల దండును నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. మిడతల నివారణకు వీలుగా పవన్ హన్స్ లిమిటెడ్ నుండి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది. దీంతోపాటు అధునాతన డ్రోన్ల సాయంతో మిడతల దండును నిరోధించాలని నిర్ణయించింది.