Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి వీరు చర్చించినట్టుగా అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోఢ శుక్రవారం లఢక్లో ఆకస్మిక పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను ఆయన కొనియాడారు. లేV్ాలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు. అలాగే నిములో ఉన్న ఫార్మర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటిబిపి దళాలనుద్దేశించి ప్రసంగించారు. మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనల తరువాత మోడీ, రాష్ట్రపతితో తొలిసారి భేటీ అయ్యారు. గత రెండు నెలల నుంచి భారత్-చైనా మధ్య జరిగిన ఘటనలు, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు, 59 చైనా యాప్ల నిషేధం తదితర అంశాలన్నీ చర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి సంబంధించి రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ''ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఆయనకు వివరించారు'' అని పేర్కొంది.