Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్
- 'తప్పనిసరి లైసెన్స్' అమలు చేయాలి
న్యూఢిల్లీ : కరోనా ఔషధాలకు సంబంధించి పేటెంట్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ మేరకు పేటెంట్ చట్టంలోని క్లాజ్ 92ను వెంటనే అమలు చేయాలని, ఔషధ జనరిక్ వర్షన్ తయారీకి లైసెన్స్ను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇది చాలా ముఖ్యమైనదని తెలిపింది. ఇదే సమయంలో కరోనా రోగులకు చికిత్స అందించడంలో గిలీడ్ సైన్సెస్ సంస్థ తయారు చేసిన యాంటీ వైరల్ ఔషధం ' రెమ్డెసివిర్' మంచి ఫలితాలు చూపిస్తున్నదని తెలిపింది. అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడే అన్ని రకాల ఔషధాలను నిల్వవుంచుకున్న అమెరికా ఈ ఔషధ మొత్తం స్టాక్ను కూడా రానున్న మూడు నెలల పాటు కొనుగోలు చేసిందని పలు మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయని తెలిపింది. దీని వలన ఈ ఔషధం ప్రపంచంలోని ఇతర దేశాలకు అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 5 రోజుల కోర్సునకు సంబంధించి రెమ్డ ెసివిర్ ఔషధ ధర అమెరికాలో 3 వేల డాలర్లు(రూ.2.25 లక్షలు)గా ఉంది. గిలిడ్ లైసెన్స్పై ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు భారత్కు చెందిన ఐదు కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. భారత్లో తయారీ తర్వాత రెమ్డెసివిర్ను అదే ఐదు రోజుల కోర్సునకు రాయితీపై 400 డాలర్లు(రూ.30 వేలు-35 వేలు)కు అమ్మే అవకాశం ఉంది. నిపుణుల అంచనా
ప్రకారం.. అమెరికాలో ఫుల్ కోర్సు రెమ్డెసివిర్ తయారీ ఖర్చు 10 డాలర్లు(రూ.750)గా ఉండగా, అది భారత్లో రూ.100 ఉంటుంది. కానీ, పేటెంట్ గుత్తాధిపత్యంతో గిలీడ్ సంస్థ తయారీ ఖర్చుకు వందల రెట్లు పెంచి డబ్బును ప్రపంచం నుంచి డిమాండ్ చేస్తోందని పొలిట్బ్యూరో పేర్కొంది. భారత్లో కరోనా రోగులకు రెమ్డెసివిర్ను వినియోగించేందుకు సంబంధించిన ఆమోద ప్రక్రియను భారత ఔషధ నియంత్రణ
మండలి(డిసీజీఐ) వేగవంతం చేసింది. అయితే గిలిడ్ సంస్థ నుంచి మొత్తం స్టాక్ను అమెరికా కొనుగోలు చేయడంతో పాటు పేటెంగ్ గుత్తాధిపత్యం కారణంగా ఉత్పత్తి చేసేందుకు అధిక ఖర్చయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తర్వాత అందుబాటులోకి వచ్చినా కూడా అంత భారీ ధరకు దాన్ని కొనుగోలు చేసే శక్తి భారత్లోని రోగులకు ఉండదు. ఇటువంటి సమయంలో ఖర్చు తగ్గింపునకు మార్గాలను అన్వేషించాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత పేటెంట్ చట్టంను తీసుకురావడంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాయని తెలిపింది. ఈ చట్టంలోని క్లాజ్ 92 ప్రకారం.. భారత్లో ఒక ఔషధాన్ని తయారు చేయాలంటే లైసెన్స్ను తప్పనిసని చేసే హక్కు భారత్కు ఉంది. రెమ్డెసివిర్ జనరిక్ వర్షన్ను తయారు చేసే సామర్ధ్యం, సంకల్పం దేశంలోని జనరిక్ ఔషధ తయారీదారులకు ఉంది. 92ఎ క్లాజ్ ప్రకారం ఔషధాన్ని తయారుచేసుకునే సామర్థ్యం లేని దేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా తప్పనిసరి లైసెన్స్ను జారీ చేయవచ్చు. గిలిడ్ సంస్థ దోపిడీ ధరలను చూస్తుంటే దేశంలోని పలు తయారీదారులకు వెంటనే తప్పనిసరి లైసెన్స్ను జారీ చేయాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొంది.
ప్రపంచంలో భారత్ ఒక పెద్ద జనరిక్ ఔషధాల తయారీదారుగా ఉందని, రెమ్డెసివిర్ ఔషధాన్ని దేశంలోని ప్రజలకు సరసమైన ధరల్లో విసృతంగా అందుబాటులో ఉంచేందుకు మరే కారణాలు అవసరం లేదని పొలిట్బ్యూరో పేర్కొంది.