Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రహేజ క్యూబీఈని పేటియం మాతృసంస్థ ఒన్97 స్వాధీనం చేసుకోనుంది. ఈ బీమా కంపెనీలోని 100 శాతం వాటాను పేటీయం కొనుగోలు చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. రహేజా క్యూబీఈలో ప్రిస్మ్ జాన్సన్కు 51 శాతం వాటా ఉండగా క్యూబీఈ ఆస్ట్రేలియా 49 శాతం వాటా ఉంది. ఈ ఒప్పందం విలువ రూ.568 కోట్లుగా ఉందని సమా చారం. ముంబయి సహా వివిధ ప్రాంతాల్లో పనిచేసే క్యూబీఈ ఉద్యో గులు యథావిథిగా కొనసాగుతారని సంబంధిత వర్గాలు వెల్లడిం చాయి. కొనుగోలును వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని పేటీయం భావిస్తోంది. పేటీయం ఆర్థిక సేవల ప్రయాణంలో ఇది కీలక మైలురాయనీ.. క్యూబీఈని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని పేటియం ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ పేర్కొన్నారు.