Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గిలియడ్ సైన్సెస్ రెమెడిసివిర్ జనరిక్వెర్షన్ డ్రగ్
- 100 మి.మి డోస్ ధర రూ.4800
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పంజా విసురుతున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్డెసివిర్కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలో వినియోగానికి 'డెస్రెం' పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు మైలాన్ తెలిపింది. గిలియడ్ సైన్సెస్ కుచెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్ను 100 మిల్లీగ్రాముల డోస్కు 4,800 రూపాయలు (64.31డాలర్లు) చొప్పున ఈ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. 'డెస్రెం' పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్డెసివిర్ జనరిక్ వెర్షన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
సిప్లాకు చెందిన సిప్రెమిని 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే అందివ్వనుండగా, హెటెరో కోవిఫోర్ ఔషధం ధరను 5,400 రూపాయలకు నిర్ణయించింది.