Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కఠిన నిబంధనల రూపకల్పనలో కేంద్రం
న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇటీవల చైనా యాప్లను నిషేధించిన క్రమంలో విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు మోడీ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు స్పష్టమవుతోంది. కాగా ఈ-కామర్స్ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో కొత్త ఆన్లైన్ విక్రయ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ఆధిపత్యాన్ని తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడానికి కసరత్తు జరుగుతుందని అధికార వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ ముసాయిదాను రూపొందించింది. ఇది రెండేండ్ల పాటు అమల్లో ఉంటుందని తెలుస్తోంది. నూతన నిబంధనల ప్రకారం ఈ-కామర్స్ కంపెనీలు 72 గంటల్లోగా ప్రభుత్వం కోరిన డేటాను అందుబాటులోకి తీసుకురావాలి.
జాతీయ భద్రత, పన్నులు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై సత్వరమే ఆయా సంస్థలు సమాచారం అందించాల్సి ఉంటుంది.