Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం నిర్ణయం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజూకి తీవ్రంగా విజృంభిస్తోంది. కోవిడ్-19 కేసులు అధికమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మార్చి 19వ తేదీ నుంచి మూతపడ్డ తాజ్మహాల్ తిరిగి సోమవారం సందర్శకుల కోసం ప్రారంభించాలని కేంద్రం తొలుత నిర్ణయం తీసుకుంది. కానీ , ప్రస్తుతం ఆ నిర్ణయం వాయిదా వేస్తున్నట్టు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోనూ.. తాజ్ ఉన్న ఆగ్రాలో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారవర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల తాజ్మహాల్ను తెరిచే పరిస్థితుల్లేవని యూపీ సర్కారు కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో యూపీలో కేసులు తగ్గుముఖం పట్టాక తాజ్మహాల్ ప్రారంభించే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తామని కేంద్రం తెలిపింది.