Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మందితో నిపుణుల కమిటీ నియామకంః ఎన్హెచ్ఆర్సీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మహ మ్మారి కరోనా దేశవ్యాప్తంగా విజృం భిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం మానవ హక్కులపై ఏ విధంగా పడుతున్నదో అంచనా వేయాల్సిన అవసరం ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ) అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం 11 మందితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఎన్ హెచ్ఆర్సీ మీడియాకి వివరించింది. ఈ కమిటీలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు డీకే రెడ్డిని చైర్మెన్ గా, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మజు దారువాల తదితరులు సభ్యులుగా ఉంటారని ఎన్ హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. కరోనా కారణంగా అణగారిన ప్రజానీకం హక్కులు, వారి జీవన విధానంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి..తదితరఅంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లాక్డౌన్ కాలంలో వలస కార్మికుల సమస్య ప్రధానంగా తెరపైకి రావడంతో ఎన్హెచ్ఆర్సీ కి భారీగా ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పరిస్థితిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ కమిటీ విచారణకు సహకరించాల్సిన ఉంటుందని ఎన్హెచ్ఆర్సీ చెప్పింది.