Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-థానేలో100 మి.మీ పైగా వర్షపాతం
ముంబై : ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశఆర్థిక రాజధానిగా చెప్పుకునే మహానగరంలో ప్రతిఏటా కురిసే వానలు అక్కడి జనజీవనంపై ప్రభావంచూపుతున్నాయి. రహదారులు కాస్త చెరువుల్లా మారుతున్నాయి. తాజాగా ముంబయి శివారు ప్రాంతంతో పాటు పక్కన ఉన్న థానే జిల్లాలో గత 24 గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మహారాష్ట్రలోని కొంకణ్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. థానే- బెలాపూర్ ఇండ్రస్టీయల్ అసోసియేషన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల సమయానికి 24 గంటల్లో 213.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ముంబయి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా 115.6 మి.మీ వర్షపాతం నమోదైనట్టు ముంబయి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కె.ఎస్ హోసాలికర్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ముంబయిలోని పశ్చిమ శివారు ప్రాంతంలో శాంటాక్రూజ్ వాతావరణ కేంద్రం ఉదయం 8.30లకు ముగిసిన 24 గంటల్లో 116.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో దక్షిణ ముంబయిలోని కొలాబా వాతావారణ కేంద్రంలో 12.4 మి.మీ వర్షం కురిసింది. మహారాష్ట్రలోని రారుగడ్ జిల్లాలో మాథరన్ బ్యూరో 24 గంటల వ్యవధిలో 90 మి.మీ నమోదు చేసింది. అలాగే పాల్గర్ జిల్లాలో దహను అబ్జర్వేటరీలో 60.3 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురవడం వల్ల ముంబయిలోని పొవారు సరస్సు పొంగిపొర్లుతోంది.గుజరాత్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి.