Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : బెంగాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడిచేయడానికి మరో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి సోమవారం వరకూ కోల్కతా హైకోర్టు మూసివేయబడుతుందనీ, న్యాయస్థానం భవనాలను శానిటైజేషన్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైనా ఆంక్షలను అతిక్రమిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కారు హెచ్చరించింది.