Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం నిరసన
న్యూఢిల్లీ : ఏకపక్షంగా కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) గురువారం పేర్కొంది. సమాఖ్య స్ఫూర్తికి, దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఈ బిల్లు విఘాతం కల్గించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 3న విద్యుత్ శాఖ మంత్రులతో జరిగిన ఆన్లైన్ వీడియోసమావేశంలో 11 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేసింది. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్లుండగా, కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరీ బిల్లును వ్యతిరేకించినట్టు ఏఐపీఈఎఫ్పేర్కొంది. విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేయడం తమ ఎజెండా కాదని కేరళ స్పష్టం చేసినట్టు తెలిపిందని ఏఐపీఈఎఫ్ ప్రతినిధి వికె గుప్తా తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి బదులు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంపై పంజాబ్ అభ్యంతరం తెలిపిందన్నారు. కేంద్రం చేపట్టే అన్ని నియామకాల్లో రెగ్యులేటరీ కమిషన్ల కోసం సెలక్షన్ కమిటీ ఉండాలన్న ప్రతిపాదనను కూడా తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థను నీరుగార్చుతోందని మహారాష్ట్ర విమర్శించిందన్నారు. విద్యుత్ రంగంపై అధికారం ఉమ్మడి జాబితాలో ఉన్నందున, విధాన పరమైన విషయా లకు సంబంధించి ఏదైనా సవరణ చేసే ముందు రాష్ట్రాలను సంప్రదించాలని బీహార్ పేర్కొన్నట్టు గుప్తా చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరించడాన్ని బీహార్ తీవ్రంగా తప్పు పడుతోందని చెప్పారు. రాజస్థాన్ అయితే ఈ బిల్లును రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొందని వివరించారు. డీబీటీతో పాటు, ప్రయివేటీకరణ, పునరుద్ధరణ కొనుగోలు బాధ్యత వంటి నిబంధనలను తమిళనాడు వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.