Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఒక్కరోజే కొత్తగా 25 వేల కేసులు
- టాప్-6లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, యూపీ, తెలంగాణ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణ కలవరం రేపుతున్నది. రోజురోజుకూ వైరస్ ఉధృతి పెరుగుతూ.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికా, బ్రెజిల్ల కంటే భారత్లోనే కరోనా కేసుల్లో వృద్ధిరేటు ఎక్కువగా నమోదైంది. కోవిడ్-19 ప్రభావం అధికంగా ఉన్న దేశల్లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో గత వారం రోజుకు సగటున 1.8 శాతం మేర కేసుల్లో వద్ధి నమోదు కాగా.. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 2.7 శాతం నమోదయింది. అయితే, మూడో స్థానంలో ఉన్న భారత్లో గత వారం రోజుల్లో సగటున ఏకంగా 3.5శాతం మేర కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో సగటున 1.14 మందికి కరోనా మహమ్మారి సోకుతున్నది. నెల క్రితం ఇది 1.21గా ఉంది. రెండు వారాల క్రితం 1.12శాతానికి తగ్గినా.. అనూహ్యంగా మళ్లీ పెరగడం గమనార్హం. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో నాల్గో స్థానంలో ఉన్న రష్యాలో ఒక శాతం, ఐదో స్థానంలో ఉన్న పెరులో 1.2 శాతం
మేర కరోనా కేసుల్లో వృద్ధి చోటుచేసుకుంది. కాగా, దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతుండటంతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజే దాదాపు 25 వేలకు దగ్గరగా కొత్త కేసులు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో 487 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం నాటికి దేశంలో వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21,129కి పెరిగింది. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 4,76,378 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 62 శాతానికి చేరింది.
టాప్-6 రాష్ట్రాలు
దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉంటూ.. కొత్త కేసులు నమోదులో గణనీయంగా పెరుగుదల చోటుచేసుకుంటున్నది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో తాజాగా 6,603 కొత్త కేసులు నమోదయ్యా యి. దీంతో రాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,599కి చేరింది. అలాగే, 9,667 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తాజాగా 3,756 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,26,581కి చేరిం ది. వీరిలో 1,756 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 2,033 మందికి కరోనా సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 1,04,864కు చేరింది. మర ణాల సంఖ్య 3,213కు పెరిగింది. ఇక్కడ కేసుల పెరుగుదలతో పాటు రికవరీ రేటు (70 శాతం) సైతం పెరుగుతుండటం సానుకూల పరిణామం. గుజరాత్లో మొత్తం 38,491 పాజిటివ్ కేసుల నమోదు, 1,860 మరణాలు చోటుచేసు కున్నాయి. ఉత్తరప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 32,362కు చేరింది.