Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐడీబీఐ బ్యాంక్లోనూ పెట్టుబడుల ఉపసంహరణ
- అమ్మకపు విలువ రూ.20వేల కోట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇటీవలే ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను ప్రయివేటుకు అప్పగించేలా కసరత్తును ప్రారంభించగా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు
కోల్ ఇండియాలో వాటాల విక్రయానికి తెర లేపిందని ఓ అంతర్జాతీయ న్యూస్ ఎజెన్సీ వెల్లడించింది. కోల్ ఇండియాతో పాటు ఐడీబీఐ బ్యాంక్లోనూ వాటాలను విక్రయించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రెండు సంస్థల్లో రూ.20వేల కోట్ల విలువ చేసే వాటాలను ప్రయివేటుకు కట్టబెట్టడానికి కసరత్తు జరుగుతున్నది. కోల్ ఇండియాలో ప్రస్తుతం ప్రభుత్వానికి 66 శాతం వాటా ఉంది. బీజేపీ ప్రభుత్వం 2015లో రూ.22,550 కోట్ల విలువ చేసే 10 శాతం వాటాను విక్రయించింది. ఐడీబీఐ బ్యాంక్లో ప్రస్తుతం కేంద్రానికి 47 శాతం వాటా, ఎల్ఐసీకి 51 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.2.1 లక్షల కోట్ల విలువ చేసే వాటాలను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా కరోనా బారిన పడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునివ్వడానికి వాటాల విక్రయం చేపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొనడం గమనార్హం. మరోవైపు బొగ్గు గనుల ప్రయివేటీకరణను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.