Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని రీవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పార్కుని శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పార్కును జాతికి అంకితం చేశారు. మధ్యప్రదేశ్ శుద్ధ, సౌర ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ శుద్ధ ఇంధన రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్గా భారత్ ఎదిగిందని అన్నారు. సౌర శక్తి శుద్ధమైన, భద్రతమైన, భరోసా కల్పించే ఇంధనమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. పర్యావరణ రహిత విద్యుత్ వినియోగానికి ప్రోత్సహిస్తూ.. దేశవ్యాప్తంగా 36 కోట్ల ఎల్ఈడి బల్బులను అందజేశామని ప్రధాని తెలిపారు. దీంతో డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరిగిందని, తద్వారా ఆరేళ్లలో వాటి ధర పదింతలు తగ్గాయని వెల్లడించారు. విద్యుత్ రంగంలోనూ స్వయం సమద్ధి సాధించడం చాలా కీలకమన్నారు.