Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో పిటిషన్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కొత్త సచివాలయం నిర్మాణానికి, పాత సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో జూన్ 29న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభమయ్యాయని, తక్షణమే జోక్యం చేసుకొని హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని జీవన్ రెడ్డి కోరారు.