Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఎస్ఇ పాఠ్యాంశాల తొలగింపుపై ఐలూ నిరసన
న్యూఢిల్లీ : లౌకికవాదం, ప్రజాస్వామ్యం అనేవి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగమని, దాని సూత్రాలు తెలుసుకోవడం నేటి విద్యార్థులు, రేపటి పౌరుల ప్రాథమిక హక్కులని అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలూ) పేర్కొంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల సూత్రాలైన లౌకికవాదం, ప్రజాస్వామ్య హక్కులు, లింగ సమస్యలు, వైవిధ్యం, కులం, మతం వంటి అధ్యాయాలను సీబీఎస్ఇ పాఠ్యాంశాల నుండి తొలగించడంపై ఐలూ నిరసన వ్యక్తం చేసింది. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ అందించిన ఫలాల గురించి తెలుసుకోకుండా ఉంటే..అది వారు ఎప్పటికీ సాధించలేని కలే అవుతుందని, ప్రతికూల ఉత్పాదకతగా మారుతుందని ఐలూ పేర్కొంది.