Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిదండ్రులకు సూచించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ సమయంలో చెల్లించాల్సిన స్కూల్ ఫీజులపై మారిటోరియం విధించే అంశాన్ని ఆయా హైకోర్టులోనే తేల్చుకోండని విద్యార్థుల తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు శుక్రవారం సూచించింది. ప్రతి జిల్లాలో, రాష్ట్రాల్లో పరిస్థితి విభిన్నమని పేర్కొంది. 'ప్రతి రాష్ట్రంలో సమస్య భిన్నంగా ఉంటుంది. పిటిషన్దారులు ఈ కోర్టు అధికార పరిధిని ఓమ్నిబస్ కేసుగా భావిస్తున్నారు. కానీ ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో వాస్తవ-తీవ్ర పరిస్థితులను తెలుసుకోవాలి' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా అంశాలను పరిశీలిస్తుందని అన్నారు. మహమ్మారి సమయంలో ఖైదీల విడుదల, వలసకార్మికుల సంబంధించిన సమస్యలపై విచారణ చేపట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీలు(పిటిషన్దారులు) అనేక విషయాలపై సుప్రీంకోర్టు అధికార పరిధిని కోరుతాయని, ఆదేశాలు వారి అంచనాలు అందుకోని సమయంలో నిరాశ వ్యక్తం చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించగలిగితే..మేథావితనానికే దెబ్బ అని పేర్కొన్నారు. కాగా, పాఠశాల తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, సునీల్ గుప్తా వాదనలు వినిపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల్లో విభిన్న ఆలోచనలు ఉన్నాయని అన్నారు. పాఠశాల విధానం జిల్లా..జిల్లాకు మారుతుందని సిబాల్ అన్నారు. కాగా, అధికంగా ఫీజులు వసూలు చేసుకునేందుకు పాఠశాలలకు పంజాబ్, హర్యానా కోర్టు అనుమతినిచ్చిందని బాలాజీ శ్రీనివాసన్, మయాంక్ క్షీర్సాగర్ అనే న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే ఉత్తర్వులపై పిటిషన్ దాఖలు చేయమని వారికి సుప్రీంకోర్టు సూచించింది.