Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర కేంద్ర మంత్రులతోనూ సమావేశం
- రాష్ట్రానికి సంబంధించిన నిధుల విడుదలపై మంతనాలు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆమెతో మంతనాలు జరిపారు. అనంతరం ఆయన కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రీయింబర్స్మెంట్ కోసం రివాల్వింగ్ ఫండ్ నుంచి నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరినట్టు చెప్పారు.
నాబార్డు ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నప్పటికీ, ఆ నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు. అటుతర్వాత బుగ్గన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని కలిశారు. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకమే అని మంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి.