Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పపుమ్ పరే : అరుణాచల్ప్రదేశ్లోని పపుమ్ పరే జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఇంటిపై కొండచరియలు పడి నలుగురు మృతి చెందారు. వీరిలో ఎనిమిది నెలల పసిపాప కూడా ఉంది. గురువారం రాత్రి నిద్రపోయిన వీరు చివరికి నిద్రలో మృత్యుఒడికి చేరుకున్నారు. టిగ్డో గ్రామంలో తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం శిథిలాల నుంచి మృతదేహాలను పోలీసులు, స్థానిక ప్రజలు వెలికితీశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పెమ ఖండు బాధితులకు రూ 4 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అరుణాచల్ప్రదేశ్లో గత రెండు నెలల్లో కొండచరియలు పడి ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మే చివరి నుంచి ఇప్పటి వరకూ కొండచరియలు పడి 21 మంది మృతిచెందారు. మేఘాలయలో ఒక నెల క్రితం ఒక వ్యక్తి మృతి చెందాడు.