Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యానికి తోడు కరోనా సంక్షోభం తోడు కావడంతో దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటుంది. ప్రస్తుత ఏడాది 2020 ఏప్రిల్ - జూన్ త్రైమాసికం (క్యూ2)లో భారత్లోని కీలకమైన 9 నగరాల్లో గృహ అమ్మకాలు ఏకంగా 66 శాతం క్షీణించి 21,294 యూనిట్లకు పరిమితమయ్యాయని అనలిస్టు ప్లాట్ఫామ్ ప్రొప్ ఈక్విటీ ఓ రిపోర్ట్లో తెలిపింది. దీని ప్రకారం.. ఇంతక్రితం జనవరి- మార్చి త్రైమాసికం (క్యూ1)లో 62,851 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేసిన లాక్డౌన్ వల్ల గడిచిన త్రైమాసికంలో గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. కొత్త గృహాల ఆవిష్కరణలు ఏకంగా 81 శాతం క్షీణించి 11,967 యూనిట్లకు పరిమితమయ్యాయి. మార్చి త్రైమాసికంలో 63,535 యూనిట్ల ఆవిష్కరణలు జరిగాయి. అమ్మకాలు లేకపోవడంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల జోలికి పోవడం లేదు. మిగతా నగరాలతో పోల్చితే నోయిడాలో అత్యధికంగా అమ్మకాలు పడిపోయాయి. గుర్గావ్లో విక్రయాలు 79 శాతం క్షీణించి 361 యూనిట్లకు పరిమితమయ్యాయి. కాగా హైదరాబాద్, చెన్నైలో గృహ అమ్మకాలు 74 శాతం పతనమై వరుసగా 1,522, 996 యూనిట్లకు పడిపోయాయి. మే 3వ వారం నుంచి అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా లాక్డౌన్ నిబంధనలను సడలించారు. అయినా ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి సానుకూలతలు కానరావడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.