Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : డాక్టర్లు, నర్సులతో పాటు కరోనాతో ఎదురొడ్డి పోరాడుతున్న పారిశుధ్య సిబ్బందికి కనీస వసతులు కల్పించడంలో ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వారికి సరిగా జీతాలివ్వకపోగా.. కనీస వసతులనూ కల్పిం చటం లేదు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఎస్ఎంఎస్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, గోయెంకా ఆస్పత్రిలో పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగారు. ఎస్ఎంఎస్లో 80 మంది, గోయెంకాలో 25 మంది సిబ్బంది 10 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. ఏప్రిల్ నుంచి తమకు వేతనాలు ఇవ్వడం లేదనీ, జీతాలు, వసతుల గురించి అడిగితే తమను ఉద్యోగాల్లోంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అహ్మదాబాద్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రి.. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో నడుస్తున్నది. ఇందులో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న 80 మంది పారిశుధ్య సిబ్బందికి జీతాలు సరిగా చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు. 'దీనిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చినప్పటినుంచి మేం 12 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నాం. పని గంటలు పెరిగినా.. మా జీతా లు మాత్రం పెరగలేదు. అదనంగా చేస్తున్న పనికి జీతాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరినా వాళ్ళు పట్టించుకోలేదు. నా భార్య కూడా ఇక్కడే పని చేస్తున్నది. ఇద్దరం కలిసి పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేసినా.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం గా ఉన్నది' అని ఇక్కడ పనిచేస్తున్న బిఫిన్ భారు పర్మర్ అన్నారు. '12 గంటల్లో మాకు ఒక్కసారే భోజనం పెడుతున్నారు. వైద్యులకు ఖరీదైన వాటర్ బాటిళ్లు ఇచ్చి మమ్మల్ని సాధారణ నీటినే తాగమంటున్నారు. ఓసారి ఆ వాటర్ బాటిల్ నీళ్లు తాగిన ఓ వ్యక్తిని కొట్టారు. మాకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు' అని ఐదేండ్లుగా ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ధర్మిష్టా అన్నారు.