Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ ప్రజానీకానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ పండగను జరుపుకుంటారని ఆయన గుర్తు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ త్వరలోనే క్షేమంగా బయటపడతారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. దాదాపు 150 ఏండ్ల తర్వాత బోనాల ఉత్సవాలకు కోవిడ్-19 రూపంలో అడ్డంకి ఏర్పడిందన్నారు. అందువల్ల ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ, తమ ఇండ్లలోనే బోనాలు సమర్పించి పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.