Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బిఐ ఛైర్మన్ రజ్నీష్
న్యూఢిల్లీ : వచ్చే ఆగస్ట్ తర్వాత అన్ని రంగాలకు మారటోరియం కొనసాగింపు అవసరం లేదని ఎస్బీఐ చైర్మెన్ రజ్నీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన రెండు రోజుల వర్చువల్ ఇంటర్నల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలకూ వర్తించే రుణ మారటోరియంను డిసెంబర్ వరకూ పొడిగించాల్సిన అవసరం లేదన్నారు. అవసరాన్ని బట్టి కొన్ని రంగాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసే అవకాశాన్ని పరిశీలించొచ్చని పేర్కొన్నారు. ఇక కరోనా సంక్షోభం కారణంగా పేరుకుపోతున్న మొండి బకాయిల పట్ల ఎస్బీఐ అనవసర ఆందోళన చెందటం లేదన్నారు. జూన్ నెల నుంచే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని... కేవలం కొన్ని రంగాలే ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయన్నారు. ఆర్బీఐ తొలిసారి ప్రకటించిన మూడు నెలల రుణ మారటోరియం మే 31న ముగియగా.. దేశంలో లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో దీన్ని ఆగస్టు 31 వరకూ పొడిగించింది. మారిటోరియంను డిసెంబర్ వరకు కొనసాగించే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తుందన్న వార్తల నేపథ్యంలో రజ్నీష్ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఎస్బీఐలో మే చివరి నాటికి మారిటోరియం ఉపయోగించుకున్న ఖాతాలు సుమారు 20 శాతమని, రెండోదశ మారిటోరియంలో ఇది మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.