Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశంసించిన ఉద్ధవ్ ధాకరే
ముంబయి : కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ముంబయిలోని మురికివాడ ధారావి ప్రపంచానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దశ్ ధాకరే శనివారం కొనియాడారు. ధారావిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రసంశల జల్లు కురిపించిన మరుసటి రోజూ..దాన్ని ధాకరే కొనసాగించారు. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావిల్లో గతంలో కోవిడ్ ఉదృతి దారుణంగా ఉన్నప్పటికీ.సరైన చర్యల ద్వారా అక్కడ వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తీసుకు వచ్చారని అధనోమ్ చెప్పినట్లు పేర్కొన్నారు.
స్వీయ క్రమశిక్షణ, స్థానికుల సహకారంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చునని ధారావి ప్రపంచానికి రుజువు చేసిందని అన్నారు. ధారావిలో కరోనా బారిన పడి.. 82 శాతం మంది కోలుకున్నారని, ప్రస్తుతం 166 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మహమ్మారిని అదుపు చేసేందుకు బృహన్ ముంబయి కార్పొరేషన్, ప్రైవేటు డాక్టర్లు, ఎన్జిఒ, స్థానికుల ఉమ్మడి ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. 'ఈ ప్రయాణం అంత సులభమేమీ కాదు. ఐక్య పోరాటమే కరోనా నివారణ దిశగా ధారావి ముందుకు సాగుతోంది' అని వ్యాఖ్యానించారు.