Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయన ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో శనివారం సాయంత్రం చికిత్స నిమిత్తం చేరారు. ఈ విషయాన్ని బిగ్బీనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, ఆస్పత్రికి వెళ్లామని.. కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు అమితాబ్ ట్వీట్ చేశారు. గత 10 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.