Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంని కోరిన మహారాష్ట్ర న్యాయవాది
న్యూఢిల్లీ : గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై తక్షణమే విచారణ చేపట్టాలని మహారాష్ట్రకు చెందిన న్యాయవాది ఘన్శ్యామ్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దూబే హతమవ్వడానికి ముందే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై 3న కాన్పూర్లోని బ్రికూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు తీసిన ముఠా ఘర్షణల్లో పాల్గొన్నారో లేదో తెలుసుకోకుండా వికాస్ దూబేతో సంబంధాలున్న ప్రతి ఒక్కరిని చంపాలన్న ఉద్దేశంతో యూపీ పోలీసులున్నారని, అందుకే తక్షణమే పిటిషన్పై విచారణ జరపాలని కోరారు. 'వికాస్ దూబేను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో అరెస్టు చేశారు. కస్టడీకి తరలించేందుకు యుపి పోలీసులకు అప్పగించారు. అయితే తరలించే సమయంలోనే వికాస్ దూబేను నకిలీ ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశముందని పిటిషన్లో పేర్కొన్నాను. అదే జరిగింది' అని సుప్రీంకోర్టు రాసిన లేఖలో పేర్కొన్నారు.