Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలో నిర్ణయం
అమరావతి: నేరాల నియంత్రణపై పరస్పరం సహకరించుకుందామని దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, కేరళ డీజీపీ లోక్నాధ్ బెహరా, తమిళనాడు డీజీపీ జేకే త్రిపాఠి, కర్నాటక డీజీపీ ప్రవీణ్ సుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రాల భద్రత, పరస్పర సహకారాలపై ప్రధానంగా చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి, లక్షద్వీప్ మధ్య పరస్పర సహాయ సహకరాలు, నేర నియంత్రణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడం, తమిళనాడు నుంచి తప్పించుకుని తిరుగుతున్న టెర్రిరిస్ట్లను పట్టుకోవాలని సమావేశంలో చర్చించారు. కేరళ, కర్నాటక, తమిళనాడు సరిహద్దు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తీర ప్రాంతంలో గస్తీని మరింత పటిష్టం చేసి కట్టుదిట్టంగా వ్యవహరించాలని నిర్ణయించారు.