Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఐఏ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై భారత ఆర్కిటెక్ట్లు తీవ్రంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. భవన నిర్మాణ రంగంలో సౌందర్యంతో పాటు సౌకర్యవంతమైన నిర్మాణాలు చేపట్టేందుకు తమవంతుగా కృషి చేయాలన్నారు. శనివారం భారతీయ నిర్మాణ రంగ నిపుణుల సంస్థ జాతీయ సదస్సు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నాట్కాన్ 2020 - ట్రాన్సెండ్) ను ప్రారంభించిన అనంతరం ఆన్లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రసంగించారు. 'నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం కూడా ఒకటి. సింధు నాగరికత, తర్వాతి కాలంలో కోణార్క్ దేవాలయం మొదలుకుని... ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ విజ్ఞానంలో స్థానిక శిల్పుల నైపుణ్యత, వినియోగించిన సామాగ్రి, సాంకేతిక విజ్ఞానం పాత్ర చాలా ప్రత్యేకం' అని తెలిపారు. ప్రాచీన, సంప్రదాయ కట్టడాల వారసత్వ నిర్మాణశైలిలోని గొప్పదనాన్ని అర్థం చేసుకుని, పర్యావరణహితంగా నిర్మాణాలు చేపట్టడంపై దృష్టిపెట్టాలన్నారు.