Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మైనింగ్ వాణిజ్యీకరణపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బొగ్గు గనుల వేలాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్, దావాపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకుగానూ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. తమతో సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించిందని జార్ఖండ్ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొంది. జార్ఖండ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ఎస్.నారీమన్, అభిషేక్ మను సింగ్విలు వాదనలు వినిపించారు. ఈ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేస్తున్నామనీ, తదుపరి విచారణను వీలైనంత త్వరలో లిస్టింగ్ చేస్తామని ఈ సందర్భంగా కోర్టు వారికి తెలిపింది. తమ పిటిషన్ను ఆగస్టు 18 నాటి కంటే ముందుగా లిస్టింగ్ చేస్తే బాగుంటుందని, ఆ సమయంలోనే గనుల వేలం ప్రారంభమౌతుందని నారీమన్ కోర్టును కోరారు. బాబ్డే స్పందిస్తూ.. 'ఎటువంటి సమస్య ఉండదు. తేదీలను పొడగించవచ్చు. దీన్ని అటార్నీ జనరల్ పరిశీలిస్తారు' అని పేర్కొన్నారు.