Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు విప్లవ రచయిత, ప్రొఫెసర్ వరవరరావుకు తక్షణమే ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించాలని సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినరు విశ్వం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. బీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావును కేసు నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, ఆయన ప్రాణాలను కాపాడాలని లేఖ ద్వారా సీఎంని విజ్ఞప్తి చేశారు.