Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్తో తగ్గిన ఆదాయం..
-ఆ నోట్లను మార్చుకుని గట్టెక్కాలనియత్నం
- కేంద్రఆర్థికశాఖమంత్రికి టీటీడీ బోర్డులేఖ
చిత్తూరు : వెంకన్నకూ లాక్డౌన్ కష్టాలు తప్పటంలేదు. తిరుమలేశుని హుండీలో భక్తులు సమర్పించే కాసులు లాక్డౌన్ దెబ్బకు తగ్గిపోయాయి. జూన్11 నుంచి తిరుమల తలుపులు తెరుచుకున్నా.. కరోనా భయంతో సందర్శకుల సంఖ్య గణ నీయంగా పడిపోయింది. ఫలితంగా గత నెలలో కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. వాస్తవానికి కరోనా కన్నా ముందు వచ్చే ఆదాయంలో పదిశాతం కూడా లేదని టీటీడీ అధికారవర్గాలు అంటున్నాయి. దీంతో ఉద్యోగుల జీతాలకూ తిప్పలుతప్పటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాతనోట్ల కట్టల్ని ఆసరాగా చేసుకోవాలని టీటీడీ యోచిస్తున్నది. 2016 నవంబర్ నెల తర్వాత రూ.500 రూ.1000 నోట్లను మోడీ సర్కార్ రద్దు చేసింది. ఆ నోట్లు ఎవరివద్ద ఉన్నా పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని అప్పటి ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మార్గదర్శకాలు జారీచేశారు. ఇప్పటికీ పలురాష్ట్రాల్లో పాతనోట్లు భారీ సంఖ్యలో పట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. మరోవైపు తమ వద్ద ఉన్న ఆ చెల్లనినోట్లు పెట్టుకుంటే ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ.. వెంకన్న హుండీలో సందర్శకులు సమర్పించుకున్నారు. ఇప్పటికీ సందర్శకులు పాత నోట్లను హుండీలో వేస్తున్నారు. ఈ విధంగా ఆ పాతనోట్లు రూ.50 కోట్లకు చేరాయి. వాటి భద్రత ఇబ్బందికరంగా మారిందని టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి అంటు న్నారు. లాక్డౌన్కు ముందు హుండీలో కాసులు గలగలమనటం.. సందర్శకులు భారీ మొత్తంలో మొక్కులు చెల్లించుకోవటంతో వెంకన్నకు ఎలాంటి కష్టం రాలేదు. మోడీ సర్కార్ హడావుడిగా తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం ఇటు దేశ ప్రజలే కాదు.. సందర్శకులు బారులు తీరే వెంకన్నకూ కాసుల కష్టాలు తప్పటం లేదని పలువురు అంటున్నారు. కాగా, కష్టకాలంలో వున్న తామను ఆదుకునేం దుకు 'పెద్ద నోట్ల'ను మార్చాలంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరఫున చైర్మెన్ విన్నవించారు.