Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కోవిడ్ 19 మహమ్మారితో ఏర్పడిన వలస కార్మికుల సమస్యను పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం సక్రమంగా పరిష్కరించలేదని బాంబే హైకోర్టు మంగళవారం తెలిపింది. ఆ ప్రభుత్వం ఒక సమయంలో ఇతర ప్రాంతాల కార్మికులు వారి స్వరాష్ట్రాలకు తిరిగి వెళ్లడానికి అనుమతించలేదని తెలిపింది. 'పశ్చిమ బెంగాల్ పరిస్థితి మీకు తెలుసా.? మేము ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ, అక్కడి ప్రభుత్వం వలస కార్మికుల సమస్యను సక్రమంగా పరిష్కరించలేదు' అని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అనుజ ప్రభుదేశాయి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో చిక్కుకున్న వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముంబయికి చెందిన ట్రేడ్ యూనియన్స్ దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.