Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ సంక్షోభం దీనిని సూచిస్తోంది : జస్టిస్ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ : దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పందించారు. అట్టడుగు వర్గాలకు సామాజిక భద్రత అవసరమనీ, కోవిడ్-19 దీనిని సూచిస్తోందని ఆయన అన్నారు. ప్రజా హక్కులను సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని తెలిపారు. ఆయన తండ్రి దివంగత భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రసంగించిన ఆయన పై విధంగా మాట్లాడారు. '' దేశాన్ని తీవ్రంగా వణికిస్తున్న ప్రస్తుత మహమ్మారి మనకు కొత్త పాఠాలు నేర్పింది. అట్టడుగు వర్గాల వారికి కనీస సామాజిక భద్రత హామీ అవసరం. ప్రజల హక్కులను గతంలో కంటే ఎక్కువ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి'' అని చంద్రచూడ్ అన్నారు. దీర్ఘకాలిక రాజ్యాంగ కట్టుబాట్లను తిరిగి అంచనా వేయడం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా వణికిస్తున్న విషయం తెలిసిందే. పోలీసు, వైద్య రంగం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ మహమ్మారి భయపెట్టిస్తున్నది.