Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సెన్సెక్స్ 661 పాయింట్ల పతనం
ముంబయి : గత కొన్ని రోజులుగా ఆశాజనకంగా రాణిస్తున్న మార్కెట్లలో మళ్లీ కరోనా ప్రకం పనలు మోగాయి. ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 కేసులు,
మరణాలు పెరిగిపోవడంతో పాటు ఆర్థిక మాంద్యం భయాలు వెల్లువెత్తడంతో మంగళవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. వీటికి తోడు వినియోగదారుల ద్రవ్యోల్బణం మరింత తీవ్ర స్థాయికి చేరినట్టు అధికారిక గణాంకాలు రావడంతో తొలి నుంచే అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 36వేల దిగువకు పడిపోయింది. తుదకు 661 పాయింట్లు లేదా 1.8 శాతం పతనమై 36,033కు దిగజారింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు లేదా 1.81 శాతం నష్టంతో 10,607 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,517 వద్ద ప్రారంభమై 35,877 కనిష్ట స్థాయికి పతనమైంది. ఇదే బాటలో నిఫ్టీ 10,756 - 10,563 మధ్య కదలాడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తుండటంతో మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడుతుందన్న ఆందోళనలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. ఇంట్రాడే కనిష్టాలకు చేరువలోనే మార్కెట్లు ముగియడం అమ్మకాల తీవ్రతను సూచిస్తున్నదన్నారు. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో ఒక్క ఫార్మా సూచీ మాత్రమే 0.5 శాతం పెరగ్గా.. మిగిలిన సూచీలన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. బ్యాంక్ , లోహ, వాహన, రియాల్టీ, ఐటీ రంగాలు 3.2-1.2 శాతం మధ్య క్షీణించాయి.