Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు సగటు ప్రజలు, కంపెనీల ఆస్తులు మాత్రం కుదేలు అవుతుంటే మరోవైపు రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ సంపద మాత్రం రోజు రోజుకు కోట్లాను కోట్లు దాటేస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ 6వ స్థానానికి ఎగబాకారు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలెన్ మస్క్ను, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్లను అధిగమించారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద 72.4బిలియన్ డాలర్లు (రూ.5.35 లక్షల కోట్లు)గా ఉంది. గత వారమే ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది. మార్చి నుంచి ఇప్పటివరకు రిలయన్స్ సంస్థ షేర్ల విలువ 120 శాతం పైగా పెరిగింది.