Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఒక్కరోజులోనే కరోనాతో 540 మంది మృతి..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉన్నది. కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం నాటికి కేసుల సంఖ్య 9 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులోనే 28 వేలకుపైగా కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,07,645కు చేరింది. అలాగే ఒక్క రోజులోనే 540 మంది వైరస్ బారినపడి మరణించారు. తాజా మృతులతోకలిపి మొత్తం మరణాల సంఖ్య 23,727కు చేరింది. కేసుల సంఖ్యతోపాటు.. అలాగే గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 39 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.