Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీని బాధితులే. తాజాగా దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులందరు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాజమౌళి కుటుంబం డాక్టర్ల పర్యవేక్షణలో హౌం క్యారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్వీట్ చేసిన విషయం విదితమే. దీంతో రాజమౌళి, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మహేష్బాబు, జగపతిబాబు, శ్రీనువైట్ల, సాయితేజ్, రాశీఖన్నా, సుశాంత్, ప్రణీత, దేవాకట్టా, వేదిక, రాహుల్దేవ్ వంటి తదితర టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజమౌళి అభిమానులు, నెటిజన్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెట్టారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా కరోనా పాజిటివ్ కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.