Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరువు హత్యల బ్యాక్డ్రాప్లో త్వరలోనే ఓ తమిళ వెబ్ సిరీస్ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా (యాంథాలజీ) రూపొందబోయే ఈ వెబ్సిరీస్కి గౌతమ్ మీనన్, వెట్రిమారన్, సుధా కొంగర, విఘ్నేష్ శివన్ వంటి నలుగురు ప్రముఖ దర్శకులు డైరెక్ట్ చేయబోతున్నారు. నాలుగు కథలైనప్పటికీ ప్రతి కథలోని ప్రధానాంశం మాత్రం పరువు హత్యే కావడం గమనించ దగ్గ విషయం. ఇదిలా ఉంటే, ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణరు పరువు హత్య నేపథ్యంతో వెట్రిమారన్ తెరకెక్కించబోయే కథలో అమృతగా సాయిపల్లవి, ఆమె తండ్రి మారుతీరావుగా ప్రకాష్రాజ్ నటిస్తున్నారని సమాచారం. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉన్న ఈ వెబ్ సిరీస్లో తండ్రీకూతుళ్ళుగా ప్రకాష్రాజ్, సాయిపల్లవి నటించడం విశేషం. అయితే ఇదే నేపథ్యంలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా 'మర్డర్' (కుటుంబ కథా చిత్రం) పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం విదితమే.