Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాక్షసుడు' సినిమా తర్వాత తెలుగునాట అనుపమా పరమేశ్వరన్ ఊసే లేదు. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో తమిళంలో మంచి ఆఫర్లను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అలాగే ప్రస్తుతం మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఒక్కొక్క సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా తెలుగులోనూ ఓ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ రాసిన కథతో తెరకెక్కుతున్న '18 పేజెస్' చిత్రంలో నిఖిల్ సరసన అనుపమా నటించనుందని సమాచారం. పల్నాటి సూర్య దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది. నిఖిల్ ప్రస్తుతం సూపర్హిట్ సాధించిన 'కార్తీకేయ' చిత్ర సీక్వెల్లో నటిస్తున్నారు. అలాగే తాజాగా ఏషియన్ గ్రూప్కి చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించబోయే చిత్రంలోనూ నటించడానికి గ్రీన్సిగల్ ఇచ్చారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్మోహనరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. చిత్రీకరణలకు అనుమతి లభించినప్పటికీ రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో షఉటింగ్లను ఆరంభించడానికి ఎవ్వరూ సాహించడంలేదు.