Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు నటించిన 'భరత్ అనే నేను', రామ్చరణ్ సరసన నటించిన 'వినయ విధేయ రామ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కథానాయిక కైరా అద్వానీ. ఇటీవల 'కబీర్సింగ్'తో బాలీవుడ్లోనూ మంచి విజయాన్ని అందుకున్న కైరా తాజాగా తెలుగులో ఓ బంపర్ ఆఫర్ను అందుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా కైరాని చిత్ర బృందం ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉండే ఈ చిత్రానికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ రూపొందించబోయే చిత్రంలో నటించనున్నారు. ఇదిలా ఉంటే, కైరా ప్రస్తుతం 'లక్ష్మీ బాంబ్', 'షేర్షా', 'ఇందూ కీ జవాని', 'భూల్ భలయ్యా 2' వంటి తదితర బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.