Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్త్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'ఖైదీ' చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్బాబు నిర్మించగా, తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ విడుదల చేసిన ఖైదీ చిత్రం టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. టొరంటోలో ఆగస్ట్ 9 నుండి 15 వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగస్ట్ 12న 'ఖైదీ' చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికవ్వడం పట్ల 'ఖైదీ' చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది.