Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనాథలైన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని నిర్మాత దిల్రాజు తన సహదయతను చాటుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. భర్తపై బెంగతో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం చనిపోయింది. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ అనాథలయ్యారు. ఈ విషయాన్ని ఓ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సదరు గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యేతో ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్రాజు మాటిచ్చారు. తన కుటుంబం స్థాపించిన 'మా పల్లె' ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లల బాగోగులను చూసుకుంటానని దిల్రాజు తెలిపారు.