Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీ హీరో నటించిన చిత్రం 'ఖైదీ'. అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొంది మంచి విజయం సాధించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం ఈనెలలో జరగబోయే టొరంటో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా ఎంపికైంది. ఓ ఖైదీ జైలు నుంచి విడుదలైన రోజు రాత్రి ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్గా 'ఖైదీ 2' చిత్రాన్ని రూపొందించాలని భావించారు.
అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీసే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఖైదీకి సంబంధించి ఫ్లాష్బ్యాక్ కథని చూపించే ప్రయత్నమిదట. ఇందులో ఓ యువ జంటకు మంచి ప్రాధాన్యత ఉండటంతో తెలుగు నేటివిటీ కోసం ఓ యువ హీరోని, హీరోయిన్ని ఎంపిక చేయబోతున్నారని వినిపిస్తోంది. ఇందులో భాగంగా కార్తీకేయను ఆ యువ హీరోగా తీసుకునేందుకు చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.